‘రెడ్’కు ఇస్మార్ట్ టచ్ !

ఎనర్జిటిక్ హీరో రామ్ కొత్త సినిమా ‘రెడ్’. కిషోర్ తిరుమల దర్శకుడు. సోమవారం (అక్టోబర్ 28) ‘రెడ్’ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది. బుధవారం (అక్టోబర్ 30) రెడ్ ప్రారంభోత్సవం జరుపుకొంది. ఇక రెడ్ ప్రారంభోత్సవానికి ఇస్మార్ట్ టచ్ ఇచ్చారు. దర్శకుడు పూరి, ఆయన సహా నిర్మాత ఛార్మి హాజరయ్యారు. వీరిద్దరు కలిసి రెడ్ కు క్లాప్ కొట్టారు. జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

ఇక టైటిల్ మాదిరిగానే సినిమా వైవిధ్యంగా ఉంటుందని దర్శకుడు కిషోర్ తిరుమల అన్నారు. కిషోర్ తిరుమలతో ఇది హ్యాట్రిక్ చిత్రం. ఆయన చేసిన మూడు సినిమాలు మా బ్యానర్ లోనే తెరకెక్కాయని హీరో రామ్ అన్నారు. ఫస్ట్ టైమ్ నా కెరీర్‌లో ఇలాంటి ఓ చిత్రాన్ని చేస్తున్నాను. ఐతే కమర్షియల్ అంశాలను కూడా మిస్ కాకుండా చూశామని చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి చూస్తే.. రామ్ ఈసారి ప్రయోగం చేస్తున్నారు. రెడ్ విభిన్నంగా ఉండనుందనే విషయం అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు ? పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వచ్చే యేడాది ఏప్రిల్ 9న రెడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.