సీపీఐ నేత గురుదాస్‌ గుప్తా కన్నుమూత


సీపీఐ సీనియర్ నేత గురుదాస్ గుప్తా కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా గుండె, మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న గుప్తా ఈ ఉదయం కోల్ కతాలో తుదిశ్వాస విడిచారు. గుప్తా 25ఏళ్ల పాటు పార్లమెంటేరియన్‌గా ఉన్నారు. 2004లో బెంగాల్‌లోని పంక్‌సురా నియోజర్గం నుంచి, 2009లో ఘాటల్‌ నుంచి ఆయన లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు.

1985, 1988, 1994లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 2009 నుంచి సీపీఐ తరఫున లోక్‌సభా పక్ష నేతగా వ్యవహరించారు. 2001లో ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌(ఏఐటీయూసీ) అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ‘సెక్యూరిటీస్‌ స్కాండల్‌-ఏ రిపోర్ట్‌ టు ది నేషన్‌’ అనే పుస్తకం కూడా రచించారు. గుప్తా మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.