ధియేటర్స్’కి వచ్చిన వాళ్లకి మాత్రమే చెప్తారట !

ఇన్నాళ్లు ‘మీకు మాత్రమే చెప్తా’ అన్నారు. ఇప్పుడేమో థియేటర్స్ వచ్చిన వారికి మాత్రమే చెప్తానని అంటున్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా మారి చేసిన సినిమా ఇది. వాణి భోజన్ హీరోయిన్. షమీర్ దర్శకుడు. యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి విజయ్ దేవరకొండ నిర్మాత. టీజర్, ట్రైలర్ తో ఆసక్తి కలిగించిన ఈ చిత్రం రేపు (నవంబర్1)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో లాస్ట్ పంచ్ అన్నట్టు.. చిత్రబృందం ఓ వీడియో విడుదల చేసింది.

ఇందులో అనసూయ మాట్లాడుతూ.. నవంబర్ 1న మీకు మాత్రమే చెప్తాం అన్నాం. ఇప్పుడా టైం వచ్చింది. రేపు థియేటర్స్ కి వచ్చి చూసిన వారికి మాత్రమే చెప్తాం అన్నారు. చిత్రబృందం చెప్పడం సంగతి పక్కనపెడితే.. రేపు మాత్రం సినిమా చూసిన ప్రేక్షకులు హిట్టా.. ఫట్టా అని తేల్చనున్నారు. ఈ సినిమా హిట్టయితే.. విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ నుంచి మరిన్ని విభిన్నమైన సినిమాలు రావొచ్చు. దానికోసమైనా.. మీకు మాత్రమే చెప్తా సినిమా హిట్ కావాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ మీకు మాత్రమే చెప్తా టీం.