బన్నీతో సుక్కు బిజినెస్ బాగానే.. !

సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో హ్యాట్రిక్ చిత్రానికి కొబ్బరికి కొట్టిన సంగతి తెలిసిందే. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ జరగనుంది. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సుకుమార్ చేస్తున్న చిత్రమిది. ఈ చిత్రం కోసం సుక్కు రెమ్యూనరేషన్ తీసుకోవడం  లేదట. దాని స్థానంలో బిజినెస్ లో షేర్ తీసుకొంటున్నట్టు సమాచారమ్.

సినిమా విడుదలకు ముందు, విడుదల తర్వాత సినిమా చేసే బిజినెస్‌లో షేర్ కావాలని సుక్కు కోరారట. ఈ మేరకు తనకు రెమ్మూనరేషన్ అవసరం లేదని తెగేసి చెప్పారట. ఈ విషయమై చర్చలు జరిపిన మైత్రి నిర్మాతలు చివరకు ఓకే చెప్పేశారని సమాచారం. ఐతే,  సినిమా పూర్తయ్యేవరకు నెల నెలా ఖర్చుల నిమిత్తం మైత్రి నిర్మాతల నుంచి కొంత సొమ్ము తీసుకుంటారట.

ఇక గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో బన్నీ సినిమా ఉండబోతున్నట్టు సమాచారమ్. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనుంది. వచ్చే యేడాది సమ్మర్ లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.