కేఏ పాల్ వస్తున్నాడు.. ఇక కామెడీ మస్త్ !

ఈ యేడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మస్త్ గా ఎంటర్ టైన్ చేసిండు.. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ఇక ఎన్నికలు ముగిశాక.. జగన్ సీఎం అయ్యాక పత్తా లేకుండా పోయాడు. దీంతో.. ఏపీలో మళ్లీ ఎన్నికలు వస్తాయో.. కేఏ పాల్ కామెడీ ఎప్పుడు చూస్తామోనని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. రేపే కేఏ పాల్ ఎంట్రీ.
 
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించినట్టు ఇటీవల విడుదలైన ట్రైలర్ ని చూస్తే అర్థమైంది. అంతేకాదు.. ఈ సినిమాతో తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు చినబాబు లోకేష్ ని మరోసారి టార్గెట్ చేశాడు వర్మ. ట్రైలర్ లో లోకేష్ పప్పు అన్నట్టుగా చూపించిన సీన్ హైలైట్ అయింది. దీనిపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. వైసీపీ శ్రేణులు ఎంజాయ్ చేస్తున్నాయ్. 

ఈ విషయం పక్కనపెడితే.. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాలో కేఏ పాల్ కూడా ఉన్నారు. ఆయనకి పాటని రేపు (నవంబర్ 2) ఉదయం 9:36 నిమిషాలకి రిలీజ్ చేయబోతున్నట్టు వర్మ ట్విట్ చేశారు. కేఏ పాల్ నే  కామెడీ అంటే.. ఆయనపై వచ్చే పాట మరింత వినోదాన్ని పంచనుంది.. జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బహుశా ఈ పాటలో కేఏ పాల్ తింగరి పనులన్నీ చూపిస్తాడేమో !