‘మీకు మాత్రమే చెప్తా’ ట్విట్టర్ రివ్యూ

రౌడీ హీరో విజయ్ దేవకొండ నిర్మాతగా మారి చేసిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. అంతేకాదు.. ఈ సినిమా కోసం దర్శకుడు తరుణ్ భాస్కర్ ని హీరోగా మార్చాడు. వాణి భోజన్ హీరోయిన్. షమీర్ సుల్తాన్ దర్శకుడు. అభినవ్ గౌతమ్, యాంకర్ అనసూయ కీలక పాత్రల్లో నటించారు. కథపై ఉన్న నమ్మకంతో ఇన్నాళ్లు సంపాదించిన దాంట్లో 70 శాతం ఖర్చుపెట్టి మరీ.. ఈ సినిమా చేశాడు విజయ్ దేవరకొండ. ఆ నమ్మకం వమ్ముకాలేదని.. సినిమా బాగుందనే పబ్లిక్ టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్ పడిపోయాయ్. సినిమా చూసిన వాళ్లు ట్విట్టర్ వేదిక సినిమా టాక్ ని పంచుకొంటున్నారు. వాళ్లు ఏమంటున్నారంటే.. ? ‘మీకు మాత్రమే చెప్తా’ ఫన్ రైడ్. హాయిగా నవ్వుకోవచ్చు. ఈ కథ కూడా ఈ తరాన్ని కనెక్ట్ అయ్యేలా ఉంది. ఫ్రెష్ గా ఉంది. ఇక తరుణ్ భాస్కర్ నటన అద్భుతం. తన అద్భుతమైన నటనతో సినిమాని నిలబెట్టారు. విజయ్ దేవరకొండ ముందే చెప్పినట్టు తరుణ్ భాస్కర్ అన్నీ ఎమోషన్స్ ని చక్కగా పడించగలరని ఈ సినిమాతో రుజువైంది. ఇక అభినవ్ గౌతమ్ నటన బాగుంది. అనసూయ అదరగొట్టేసింది. మొత్తంగా.. మీరు నవ్వు ఆపుకోలేరని చెబుతున్నారు.

ఇక చిన్ని చిన్ని నెగటివ్ టాక్ కూడా వినిపిస్తోంది. పాత్రలపై పెట్టిన ఫోకస్ కథపై పెట్టలేదని, అనసూయ పాత్రని ముందే ఊహించవచ్చని, ఫస్టాఫ్ లో చాలా వరకు కథే  ఉండదనే కామెంట్స్ వినిపిస్తున్నాయ్. ఐతే, కామెడీ వర్కవుట్ అయిందని చెబుతున్నారు. కామెడీ పండిన ఏ సినిమా అయినా.. నిలబడినట్టేనని చరిత్ర చెబుతోంది. ఇంకా చెప్పాలంటే చిన్ని చిన్ని నెగటివ్ కామెంట్స్ సహజమే. ఓవరల్ గా మీకు మాత్రమే చెప్తా మస్త్ ఉంది. కచ్చితంగా చూడాల్సిన సినిమా. విజయ్ డబ్బులు సేవ్ అని చెప్పవచ్చు.