దిల్ రాజు కోరిక తీరింది !


నిర్మాత దిల్ రాజు కోరిక తీరబోతుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలన్నది దిల్ రాజు బలమైన కోరిక. దాని కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పవన్ కలిసిన నిర్మాతల్లో దిల్ రాజు మొదటివాడు. ఆ మధ్య విజయవాడ వెళ్లిన దిల్ రాజు పవన్ తో చాలా సేపు ముచ్చటించినట్టు వార్తలొచ్చాయ్. పవన్ కోసం చాలా కథలని తీసుకెళ్లారు. ఫైనల్ గా ‘పింక్’ రిమేక్ కోసం పవన్ ని ఒప్పించారు. ఈ సినిమాపై ఇవాళ అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రాన్ని బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మించనున్నారు. యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయ్. ఇక ఈ సినిమా కోసం పవన్ కు రూ. 50కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ? ఏపీ అసెంబ్లీ ముందు, అజ్ఝాతవాసి సినిమా తర్వాత పవన్ తో సినిమా చేసేందుకు ఏఎం రత్నం చాలా ట్రై చేశారు. ఆ సమయంలో పవన్ కి రూ. 50కోట్ల పారితోషం ఇస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత పవన్ కి వచ్చిన ఆఫర్ నిజమేనని అన్నారు. ఇప్పుడు పవన్ రీ ఎంట్రీ సినిమాకు కూడా ఆ రేంజ్ పారితోషికం తీసుకోబోతున్నట్టు టాక్.

ఇక దిల్ రాజు కోరికల్లో ఒకటి తీరబోతుంది. ఆయనకి మరో కోరిక కూడా ఉందట. అదే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో మరో సినిమా చేయాలని. గతంలో ప్రభాస్ నటించిన మిస్టర్ ఫెక్ట్ దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కింది. ఐతే, బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగింది. ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఓ ఓ ప్యాన్ ఇండియా సినిమాని చేయాలనే ప్రయత్నంలో దిల్ రాజు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే దిల్ రాజు ప్రభాస్ ని కలిసి సినిమా పై చర్చించినట్టు చెబుతున్నారు.