మహేష్’కు దిల్ రాజు వార్నింగ్ ?

సంక్రాంతి సినిమాలు నిర్మాత దిల్ రాజు తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తున్నట్టు సమాచారమ్. అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురంలో’, మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి సినిమాలుగా వచ్చే యేడాది జనవరి 12 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పండగ సీజన్ లో రావడమే కొంత మేరకు రిస్క్. ఇక ఒకేరోజు వస్తే పెద్ద రిస్క్ అనే చెప్పాలి. 
ఈ రెండు చిత్రాలు దిల్ రాజు ని ముఖ్యమే. సరిలేరు నీకెవ్వరు సినిమాకి దిల్ రాజు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇక అల.. వైకుంఠపురంలో సినిమా నైజాం హక్కులని దిల్ రాజు తీసుకొన్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి సినిమాలు ఆయన్ని టెన్షన్ పెడుతున్నాయ్. ఈ నేపథ్యంలో ఇటీవల మహేష్ ని కలిసిన దిల్ రాజు.. సినిమాని జనవరి 10న రిలీజ్ చేద్దామని.. లేదంటే తాను సహా నిర్మాతగా తప్పుకొంటానని సుతిమెత్తగా చెప్పారట. మహేష్ కూడా అందుకు సిద్ధమే. కానీ, ఆ ప్రపోజల్ అల్లు అర్జున్ నుంచి వస్తే బాగుంటుందని భావిస్తున్నారట. మహేశ్ ఓ మెట్టిదిగినట్టే. బన్నీ కూడా ఓ మెట్టు దిగితే పరిస్థితి చక్కబడేలా కనిపిస్తోంది.