బిగ్ బాస్ 3 విన్నర్ పుకార్లపై నాగ్ స్పందన


బిగ్ బాస్ 3 విజేత ఎవరు ? అన్నది ఈ సాయంత్రానికి కల్లా తెలిసిపోనుంది. 17 మంది కంటెస్టెంట్స్‌తో జులైలో ప్రారంభమైన ఈ షో  దాదాపు 105 రోజులపాటు సాగి నేటితో ముగియనుంది. ఫైనల్‌కు చేరుకున్న వరుణ్‌ సందేశ్‌, అలీ రెజా, బాబా భాస్కర్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, శ్రీముఖిలలో ఎవరు విజేత అవుతారో మరికొద్దిసేపట్లో తెలియనుంది. ఐతే, ఇప్పటికే బిగ్ బాస్ 3 విన్నర్ ఎవరో తేల్చేస్తున్నారు నెటిజన్స్. సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ అని, కాదు శ్రీముఖి అని పోస్టులు వైరల్ అవుతున్నాయ్. తాజగా ఈ పుకార్లపై కింగ్ నాగార్జున స్పందించారు. 

“సీజన్‌ 3 విజేతకు సంబంధించి వస్తున్న వార్తలను నమ్మకండి అంటూ ట్వీట్‌ చేశారు. ”బిగ్‌బాస్‌ సీజన్‌ 3′ చివరి రోజు షూటింగ్‌. ఇదో అద్భుతమైన ప్రయాణం. నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. విజేతకు సంబంధించి సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలను నమ్మకండి. ఈ రోజు సాయంత్రం విజేత ఎవరో తెలుస్తుంది” అని నాగ్ ట్విట్ చేశారు. బిగ్ బాస్ 3 మొదలైనప్పటి నుంచి ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయం ముందే లీకవుతోంది. ఆ లీకైన న్యూసే నిజం అవుతుంది కూడా. ఇప్పుడు బిగ్ బాస్ విజేత విషయంలో న్యూస్ ముందే లీకైందనే వార్తలు వస్తున్నాయ్. అవి నిజమే అని ప్రజలు నమ్ముతున్నారు. బిగ్ బాస్ పుకార్లపై నాగ్ గతంలోనే స్పందించి ఉంటే బాగుండును. ఈ విషయంలో నాగ్ ది లేట్ రియాక్షన్ అని చెప్పవచ్చు.