వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నుంచి కేటీఆర్’కు ఆహ్వానం !

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు మరోసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా వచ్చే యేడాది జనవరి 21 నుంచి 24వరకు WEF సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొని నాలుగో పారిశ్రామిక విప్లవంలో టెక్నాలజీ ప్రయోజనాలు, ఎదురయ్యే సవాళ్లు అంశంపై ప్రసంగించాలని కేటీఆర్ ను ఫోరమ్ కోరింది. ఈ ఆహ్వానంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. గతంలోనూ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నుంచి కేటీఆర్ ఆహ్వానం రావడం… ఆయన వెళ్లి ప్రసింగించిన సంగతి తెలిసిందే.