‘పానిపట్’ ఫస్ట్ లుక్స్ చూశారా ?


1761లో జరిగిన మూడో పానిపట్టు యుద్ధం ఆధారంగా తెరకెక్కుతున్న పీరియాడికల్ చిత్రం ‘పానిపట్’. అర్జున్‌ కపూర్‌, సంజయ్‌ దత్‌, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్‌-అతుల్‌లు సంగీతం అందిస్తున్నారు. అశుతోష్‌ గోవారికర్‌ ప్రొడక్షన్స్‌, విజన్‌ వరల్డ్‌ ఫిల్మ్స్‌ ఈ చిత్రాన్ని సంయుక్తగా నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 6న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ చిత్రంలో సంజయ్‌ దత్‌ ‘అహ్మద్‌ షా అబ్దాలీ’ పాత్రలో, కృతి సనన్ ‘పార్వతీ బాయి’ పాత్రలో, అర్జున్ కపూర్ మరాఠా నాయకుడు ‘సదాశివ రావు బాహు’ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూడు పాత్రలకి సంబంధించిన ఫస్ట్ లుక్స్ ని విడుదల చేసింది చిత్రబృందం. సంజయ్ దత్, అర్జున్ కపూర్ లుక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక రేపు ఈ సినిమా టీజర్ ని విడుదల చేయనున్నారు.