ప్రభాస్-సురేందర్ రెడ్డి-దిల్ రాజు.. ఓ భారీ బడ్జెట్ సినిమా !

నిర్మాత దిల్ రాజుకు రెండు బలమైన కోరికలు ఉండేవట. ఇందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సినిమా చేయడం. అది ‘పింక్’ తెలుగు రిమేక్ తో తీరబోతుంది. యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెలుగు ‘పింక్’ తెరకెక్కనుంది. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు ఈ సినిమాని నిర్మించనున్నాడు. ఇక దిల్ రాజు రెండో కోరిక యంగ్ రెబల్ స్టార్ తో మరో సినిమా చేయాలి.

ఇటీవల ప్రభాస్ ని కలిసిన దిల్ రాజు సినిమాపై చర్చించారట. మంచి కథ దొరికితే చేద్దామని ప్రభాస్ మాటిచ్చారు. ఇక సైరా సినిమా తర్వాత ప్రభాస్ తో ఓ సినిమా చేసే ప్రయత్నం చేశారు సురేందర్ రెడ్ది. ప్రభాస్ ని కలిసి ఓ కథ వినిపించారు. అది ప్రభాస్ కి నచ్చింది. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా మారాడు. ఇది కూడా భారీ బడ్జెట్ సినిమా. ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించనున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారమ్.

సురేందర్ రెడ్డి మార్క్ స్టైలీష్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందట. ప్రస్తుతం ప్రభాస్ రాథాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా కోసం జాన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.