పాక్ ప్రమోషనల్ సాంగ్’లో పూనమ్.. చూశారా ?

పాకిస్థాన్ ఆహ్వాన గీతంలో నటి పూనమ్ కౌర్, నవజోత్ సింగ్ సిద్దూ, శిరోమని అకాళీదళ్ నాయకురాలు హర్ సిమ్రత్ కౌర్ మెరిశారు. భారత్ లోని సిక్కులు పాకిస్థాన్ లో ఉన్న కర్తార్ పూర్ దర్బార్ సాహిబ్ గురుద్వార సందర్శించేందుకు వీలుగా పాకిస్థాన్-భారత్ లు సంయుక్తంగా కర్తార్ పూర్ కారిడార్ ను నిర్మించిన సంగతి తెలిసిందే.

పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో ఉన్న డేరా బాబా నానక్ విగ్రహం నుంచి పాకిస్థాన్ లోని కర్తార్ పూర్ లో ఉన్న దర్బార్ సాహిబ్ గురుద్వారా వరకు ఈ కారిడార్ కొనసాగుతున్నది. గురునానక్ 550వ జయంతి సందర్భంగా ఈ నెల 9వ తేదిన ఈ కారిడార్ ని ప్రారంభించనున్నారు.ఈ నేపథ్యంలో సిక్కులకు ఆహ్వానం పలుకుతూ.. పాకిస్థాన్ ప్రభుత్వం ఓ పాటని విడుదల చేసింది. భారతీయ సిక్కు యాత్రికులను సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు ఈ పాట ఉంది. ఈ పాటలో నవజోత్ సింగ్ సిద్దూ, పూనన్ కౌర్ తదితరులు మెరిశారు. ఆ పాటని మీరు ఓసారి చూసేయండీ.. !