‘రాగల 24గంటల్లో’ ట్రైలర్ వచ్చేసింది !

శ్రీనివాస్ రెడ్డే దర్శకత్వంలో సత్యదేవ్‌-ఇషా రెబ్బా జంటగా చిత్రం “రాగల 24 గంటల్లో”. రఘు కుంచె సంగీతం అందించారు. శ్రీ నవ్‌హాస్‌ క్రియేషన్స్‌ పతాకంపై శ్రీనివాస్‌ కానూరు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం రిలీజ్ కి రెడీగా ఉ ంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

రొమాంటిక్ గా మొదలైన ట్రైలర్.. హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ముగించారు. చాలా ప్రేమగా చూసుకొనే భర్త సత్యదేవ్ ని ఇషారెబ్బా చంపేసినట్టు ట్రైలర్ లో చూపించారు. దాని వెనక అసలు కథేంటీ ? అనేది సినిమాలో చూపించబోతున్నారు. ఐతే, ట్రైలర్ ని చూస్టే ‘ఎవరు’ సినిమా ఛాయలు కనిపించాయి. రాగల 24గంటల్లో ట్రైలర్ ని మీరు ఓ సారి చూసేయండీ.. !