చిరు కోసం ఆ ఇద్దరు ఫైనల్ !

మెగాస్టార్ చిరంజీవి152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కున్న సంగతి తెలిసిందే. జనవరి నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ క్రమంలో చిరుకి జంటగా నటించే హీరోయిన్ ఎవరు ? అనేది హాట్ టాపిక్ గా మారింది. మొదట్లో నయనతార, అనుష్క, ఇలియానా పేర్లు వినిపించినా.. ఇప్పుడు వారంతా సైడ్ అయిపోయారు.

చిరు కోసం త్రిష దాదాపు ఫైనల్ అయినట్టు సమాచారమ్. ఇటీవలే కొరటాల త్రిషని కలిసి కథని విపించారట.ఆమె వెంటనే ఓకేచెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు, యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బాని తీసుకొన్నట్టు సమాచారమ్. ఈ నేపథ్యంలో చిరు152 సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండబోతున్నారు. ఆ ఇద్దరు త్రిష, ఈషా రెబ్బా అని చెప్పుకొంటున్నారు. ఐతే, దీనిపై చిత్రబృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ సినిమా కూడా కొరటాల మార్క్ సోషల్ మెసేజ్ తో ఉండనుందని చెబుతున్నారు. పురాతన దేవాలయాల నేపథ్యంలో సినిమా తెరకెక్కనుంది. ఇందులో చిరు దేవాదాయశాఖ అధికారిగా కనిపించనున్నారు. బడా రాజకీయనేతల బండారం బయటపెట్టే అధికారిగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించనున్నారు.