అనుష్క కోసం ముగ్గురు దర్శకులు

స్వీటీ అనుష్క కోసం ముగ్గురు దర్శకులు రంగంలోకి దిగుతున్నారు. అనుష్క తాజా చిత్రం ‘నిశ్శబ్ధం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సెలబ్రెటీ మ్యూజిషియన్ గా అంథోని అనే పాత్రలో మాధవన్ కనిపించబోతున్నాడు. అంజలి, హాలీవుడ్ యాక్టర్ మైకేల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కోన వెంకట్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. 

ఈ సినిమా టీజర్ ని ఈ సాయంత్రం 5గంటలకి విడుదల చేయబోతున్నారు. తెలుగు టీజర్ ని దర్శకుడు పూరి జగన్నాథ్, తమిళ టీజర్ ని గౌతమ్ మీనన్, హిందీ టీజర్ ని నీరజ్ పాండే చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా చిత్రబృందం ఓ పోస్టర్ ని విడుదల చేసింది.