షాకింగ్ న్యూస్ : పవన్ ఇంకా ఓకే చెప్పలేదట

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ-ఎంట్రీ ప్రకటనతో మెగా అభిమానులు మురిసిపోతున్నారు. ‘పింక్’ తెలుగు రిమేక్ లో పవన్ నటించబోతున్నారు. ఈ చిత్రానికి యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మించనున్నారని ప్రముఖ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఐతే, వీరి ఆనందానికి పవన్ బ్రేకులు వేసినట్టు తెలుస్తోంది. అసలు రీఎంట్రీకి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.

పింక్ కథని పవన్ విన్నది నిజమే. తనకి నచ్చింది అని చెప్పడమూ నిజమే. కానీ, కచ్చితంగా సినిమా చేస్తానని మాట ఇవ్వలేదట. ఇప్పుడీ విషయంపై పవన్ నిర్మాతలకి ఫోన్ చేసి క్లాస్ పీకారట. తన అనుమతి లేకుండా సినిమా ప్రకటన ఎలా చేస్తారని కడిగేశాడట. అంతేకాదు.. సినిమా విషయంలో జరుగుతున్న ప్రచారంపై అసంతృప్తిని వ్యక్తం చేశారట పవన్. ఈ సినిమా కోసం పవన్ రూ. 50కోట్ల పారితోషికం తీసుకోనున్నారు. హీరోయిన్స్ గా నయనతార, పూజా హెగ్డే నటిస్తున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ ప్రచారాన్ని ఎందుకు ఖండించలేదని నిర్మాతలని పవన్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇక తరుణ్ ఆదర్శ్ విషయానికి వస్తే.. ఆయన నోట్లో మాట ఆగదు. ఆయనకి వినిపించిన న్యూస్ అలా ట్విట్ గా వదులుతుంటారు. గతంలో ప్రభాస్-అనుష్క ప్రేమలో ఉన్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ట్విట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తరుణ్ ఆదర్శ్ ట్విట్ ని అనుష్క, ప్రభాస్ ఇదరు ఖండించారు. తాము స్నేహితులం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు పవన్ రీఎంట్రీ సినిమా విషయంలోనూ తరుణ్ తొందరపడ్డారేమో.. !