సుకుమార్ బాటలో సురేందర్ రెడ్డి !

దర్శకుడు సుకుమార్ నిర్మాతగానూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. తన బ్యానర్ లో తన శిష్యులని దర్శకులుగా పరిచయం చేస్తూ సినిమాలు చేస్తున్నారు. మంచి లాభాలు గడిస్తున్నారు. ఇప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఇదే దారిని ఎంచుకొన్నారు. ఆయన సినిమా నిర్మాణం వైపు దృష్టి పెట్టార‌న్న‌ది విశ్వ‌స‌నీయ వ‌ర్గాల టాక్‌. 

ఆయ‌న సొంతంగా ఓ నిర్మాణ సంస్థ‌ను స్థాపించి, కొత్త‌వాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌నుకుంటున్నాడు. ఈ రెండు చిత్రాల‌కూ త‌నే క‌థ అందిస్తాడు. ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త శిష్యుల‌కు అప్ప‌గిస్తాడు. సైరా తర్వాత సురేందర్ రెడ్డి మహేష్, ప్రభాస్ లతో సినిమాలు చేసేందుకు ట్రై చేశారు. ఇటీవలే ప్రభాస్ ని కలిసి కథ వినిపించాడనే వార్తలొచ్చాయ్. ఐతే, ఇప్పటికిప్పుడు ప్రభాస్ గానీ, మహేష్ గానీ రెడీగా లేరు. ఈ నేపథ్యంలో సొంత నిర్మాణ సంస్థని స్థాపించి.. రెండు చిన్ని సినిమాలని తెరకెక్కించే పని చేస్తాడని తెలిసింది.