నితిన్ ఖుషి చేసిండు !

యంగ్ హీరో నితిన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని అన్న సంగతి తెలిసిందే. అభిమాని కాదు.. భక్తుడు అని చెప్పాలి.ఇప్పుడు నితిన్ తన అభిమానులతో పాటుగా పవన్, త్రివిక్రమ్ అభిమానులని ఖుషి చేసిండు. పవన్ ప్రాణ స్నేహితుడు, దర్శకుడు త్రివిక్రమ్ అన్న నితిన్ కి చాలా ఇష్టం. త్రివిక్రమ్-నితిన్ కలయికలో వచ్చిన ‘అ ఆ’ మంచి సినిమా అనిపించుకొంది.

నేడు త్రివిక్రమ్ బర్త్ డే కానుకగా అభిమానులకి నితిన్ గిఫ్ట్ అందజేశారు. వెంకీ కడుముల దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. రష్మిక మందన కథానాయిక. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలోని సీన్ ‘ఖుషి’ సినిమాలోని భూమిక నడుం సీన్ ని రిపీట్ చేసినట్టుంది. నితిన్, రస్మిక కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టేశారు. ఈ సీన్ ట్యూన్ కూడా అదిరిపోయింది. మొత్తంగా.. అభిమానులని నితిన్ ఖుషి చేసిండు అని చెప్పాలి.

ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తుంది. వచ్చే యేడాది ఫిబ్రవరి 21న భీష్మ ప్రేక్షకుల ముందుకు రానుంది.