అల్లరోడు.. ఈసారి సీరియస్ !

అల్లరోడు ప్రేక్షకులకి బోర్ కొట్టినట్టున్నాడు. ఆయన కామెడీ చేసిన తగిన రెస్పాన్స్ ఉండటం లేదు. ఫలితంగా అల్లరోడిని వరుస ప్లాపులు పలకరిస్తున్నాయ్. ఈ నేపథ్యంలో అల్లరోడు రూటుమార్చి ‘మహర్షి’ సినిమాలో నటించారు. అది మంచి ఫలితం ఇచ్చింది. మహర్షి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నరేష్ చేసిన ‘బంగారు బుల్లోడు’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొంది. రిలీజ్ కి రెడీగా ఉంది. ఇది కూడా నరేష్ మార్క్ సినిమా. ఇందులో ఫుల్లుగా నవ్విస్తాడట.

ఈ సినిమా తర్వాత మాత్రం నరేష్ సీరియస్ అంటున్నారు. ఆయన ఓ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలో నటించబోతున్నారు. దర్శకుడు హరీశ్ శంకర్ శిష్యుడు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించనున్నారు. ఎస్‌వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగ్నేశ ఈ చిత్రాన్నినిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఈ సినిమాలో నరేశ్ సీరియస్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.