అల.. మరో సప్రైజ్ !

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని ఫాలో అవుతున్నారు. పవన్ సినిమాల్లో జానపద గీతాలు బాగా వినిపించేవి. ‘తాటిచెట్టెక్కలేవు… తాటికల్లు తెంపలేవు.. ‘, ‘బై బైయ్యే బంగారు రవణమ్మ.. ‘ లాంటి పాటలు థియేటర్ లో  ఊపేసేవి. ఇప్పుడు ‘అల.. వైకుంఠపురంలో’ సినిమా కోసం అదిరిపోయే జానపద గీతాన్ని ప్లాన్ చేశారట

ఇందులో ఓ ప్రసిద్ధమైన శ్రీకాకుళ జానపద గీతాన్ని వాడుకుంటున్నారట. ఆ పాటకి థమన్ అదిరిపోయే ట్యూన్ ఒకటి రెడీ చేశారు. ఓ ప్రత్యేకమైన సందర్భంలో ఈ పాట వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు సామజవరగమన, రాములో రాముల ఉర్రూతలూగిస్తున్నాయ్. త్వరలోనే మరో పాటని విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ఐతే జానపద గీతాన్ని మాత్రం సప్రైజ్ గా థియేటర్ లోనే చూపిస్తారట.

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది. ఇందులో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. బాలీవుడ్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. యంగ్ హీరోలు నవదీప్, సుశాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే యేడాది జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.