మహేష్ బాలీవుడ్ ఎంట్రీ ఖాయం

సూపర్ స్టార్ మహేష్ బాబుకు బాలీవుడ్ నుంచి ఎప్పుడో పిలుపొచ్చింది. కానీ, ఆయన తనకి తెలుగులోనే బాగుంది. బాలీవుకు వెళ్లను అని ప్రకటించారు. ఐతే, ఇటీవల టాలీవుడ్ స్టార్స్ బాలీవుడ్ లోనూ సత్తా చాటుతున్నారు. ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. బాహుబలి, సాహో సినిమాలతో బాలీవుడ్ లోనూ ప్రభాస్ క్రేజ్ పెరిగిపోయింది.

రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ బాలీవుడ్ లోనూ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మహేష్ కూడా ప్యాన్ ఇండియా చేయాలని నిర్ణయించుకొన్నారు. ఇప్పటికే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మహేష్ ని కలిసి ఓ కథని చెప్పాడు. అది మహేష్ కు నచ్చింది. సరిలేరు నీకెవ్వరు తర్వాత ఈ సినిమానే చేయబోతున్నారు. ఈ సినిమా ప్యాన్ ఇండియా సినిమాగా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ బాషల్లో తెరకెక్కనుందని తెలుస్తోంది. అందుకే మహేష్ బాలీవుడ్ ఎంట్రీ ఖాయమైందని ఆయన అభిమానులు ఆనందపడుతున్నారు.