అప్పుడు దోచుకొని ఇప్పుడు దీక్షలు చేస్తున్నారు

తెదేపా అధినేత చంద్రబాబు రేపు విజయవాడలో ఇసుక దీక్ష చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ దీక్షకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు కూడా ప్రకటించారు. మరోవైపు, బాబు ఇసుక దీక్షపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఇసుక దోచుకుని ఇప్పుడు దీక్షలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తెదేపా, జనసేన దొందూ దొందేనని బొత్స విమర్శించారు. 

అమరావతి స్టార్టప్ జెక్టు నుంచి సింగపూర్ కన్సార్షియం తప్పుకుందని మంత్రి బొత్స తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు వివరించమని కోరితే కన్సార్షియం నుంచి సరైన సమాధానం రాలేదన్నారు. అందుకే ప్రభుత్వంతో వారికున్న పరస్పర అంగీకారంతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని చెప్పారు. దీనిపై చంద్రబాబు, లోకేశ్ ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.