కుమారితో రాజ్ తరుణ్ మరోసారి రొమాన్స్ !

కుమారిగా కుర్రకారు మనసుని దోచేసేంది హెబ్బా పటేల్. రాజ్ తరుణ్-హెబ్బా పటేల్ జంటగా నటించిన ‘కుమారి 21ఎఫ్’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారానే రాజ్ తరుణ్, హెబ్బా ఇద్దరు వెలుగులోనికి వచ్చారు. ఈ సినిమా తర్వాత ఈ జంట మరోసారి రొమాన్స్ చేస్తే చూడాలని ప్రేక్షకులు ఆశపడుతున్నారు. ఇప్పుడు వారి ఆశలు తీరనున్నాయి. హెబ్బా పటేల్ తో రాజ్ తరుణ్ మరోసారి రొమాన్స్ చేయనున్నాడు. ఐతే, పూర్తి స్థాయి హీరోయిన్ గా మాత్రం కాదు.

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రాజ్ తరుణ్ – మాళవికా నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓరేయ్ బుజ్జిగా’. ఈ సినిమా ఓ కీలక పాత్ర కోస హెబ్బా పటేల్ ని తీసుకున్నారు. శుక్రవారం హెబ్బా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. కుమారి 21ఎఫ్ రేంజ్ లో వీరిద్దరి మధ్య హాట్ హాట్ రొమాంటిక్ సీన్స్ ఉండనున్నాయని సమాచారమ్. అసలే ప్లాపుల్లో ఉన్న రాజ్ తరుణ్ కి మళ్లీ కుమారి దొరకడం.. ఆ మేజిక్ రిపీట్ అయితే అదృష్టమే.