తొలి టెస్ట్ : మయాంక్ డబుల్ సెంచరీ

బంగ్లాదేష్ తో తొలి టెస్టులో భారత బ్యాట్స్ మెన్స్ అదరగొడుతున్నారు. ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ (202 304బంటుల్లో, 25ఫోర్స్, 5సిక్స్)  డబుల్ సెంచరీ బాదేశాడు. మైదానం అన్నీ వైపులా షాట్స్ ఆడి ఆకట్టుకొన్నాడు. ఆయనకి తోడుగా అజింక్యా రహానే 86 (172 బంతుల్లో 9 ఫోర్లు) పరుగులు చేశాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. పూజారా 54పరుగులతో ఆకట్టుకొన్నాడు.

ప్రస్తుతం టీమిండియా 215పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 150పరుగులకే చాపచుట్టేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రీజులో మయాంక్‌ అగర్వాల్‌ (202), రవీంద్ర జడేజా (12) ఉన్నారు. మయాంకర్ అగర్వాల్ రూపంలో టీమిండియాకు మంచి ఓపెనర్ బ్యాట్స్ మెన్ దొరికినట్టయింది. ఇక, వరల్డ్ కప్ కోసం మయాంక ఎంపిక అప్పట్లో వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. అనుభవం లేని మయాంక్ ని ఎంపిక చేశారని కొందరు పెదవి విరిచారు. ఇప్పుడు దానికి సమాధానం అన్నట్టుగా టెస్టుల్లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నాడు మయాంక్.