ఇక ఆ సినిమాలు చాలు

స్వీటీ అనుష్కలో రౌద్రం ఎక్కువ. అందుకే ఆమె చారిత్రక కథా చిత్రాలకి సరిగ్గా సరిపోయింది. ‘అరుంధతి’ స్వీటీ కెరీర్ నే మలుపు తిప్పింది. జేజెమ్మ పాత్రలో అనుష్కరాజసంతో పాటుఅద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించింది. ఆ తరువాత నటించిన రుద్రమదేవి, బాహుబలి 1, 2 చిత్రాలు నటిగా తారస్థాయిలో కూర్చోబెట్టాయి. ఐతే, ఇకపై చారిత్రాత్మక చిత్రాలు చేయను అంటోంది స్వీటీ.

ప్రస్తుతం స్వీటీ ‘సైలెన్స్‌’ చిత్రంలో నటిస్తోంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో ‘నిశ్శబ్దం’ అనే టైటిల్‌ ను పెట్టారు. ఇందులో అనుష్క మూగ, చెవిటి యువతిగా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన నిశ్శబ్ధం టీజర్ కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో మాధవన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇందులో నటి అంజలి కూడా ముఖ్యపాత్రలో నటిస్తోంది. ఐతే, స్వీటీ చారిత్రాక చిత్రాలకి నో చెప్పడం ఆమె అభిమానులని కాస్త నిరాశపరిచే విషయమే. ఎందుకంటే ? జేజమ్మ కత్తిపట్టి.. కదనం తొక్కితే ఆ కిక్కే వేరు.