దొంగ టీజర్ చూశారా ?

‘ఖైదీ’ తర్వాత కోలీవుడ్ హీరో కార్తీ నటించిన చిత్రం ‘తంబి’. తెలుగులో ‘దొంగ’గా రాబోతుంది. కార్తీ, ఆయన వదైన అయిన సీనియర్ హీరోయిన్ జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది.  ఈ చిత్రానికి జీతు జోసెఫ్‌ దర్శకుడు. గతంలో మెగాస్టార్‌ చిరంజీవి కూడా ‘ఖైదీ’ తర్వాత ‘దొంగ’ సినిమా చేశారు. ఇప్పుడు కార్తీ కూడా ఖైదీ సినిమా తర్వాత ‘దొంగ’ సినిమా చేస్తుండటం విశేషం. 

అక్కా తమ్ముడి సెంటిమెంట్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఇది. ఇందులో కార్తీకి అక్కగా ఆయన వదిన జ్యోతిక నటించారు. వీరిద్దరూ కలిసి నటించడం ఇదే తొలి సినిమా ఇదే. సత్యరాజ్‌, షావుకారు జానకి కీలక పాత్రలో నటించారు. తాజాగా దొంగ టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ లో కార్తీ దొంగ వేషాలు హైలైట్ గా నిలిచాయి. తమ్ముడు కోసం జ్యోతిక కన్నీళ్లు కారుస్తూ కనిపించింది. దొంగ టీజర్ ని మీరు ఓ సారి చూసేయండీ.. !