సంచలన విషయాలని బయటపెట్టిన వంశీ !

టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వైకాపాలో చేరేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసేందుకు కూడా రెడీ అయిన ఆయన ఇదివరకే ప్రకటించారు. ఇక, టీడీపీ వీడిన వంశీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు, యువనేత నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. అసలు చంద్రబాబు ప్రతిపక్షనాయకుడిగా కూడా న్యాయం చేయడం లేదని ఘూటుగా వ్యాఖ్యానించారు. దానికి టీడీపీ నేతల నుంచి వంశీకి కౌంటర్లు పడుతున్నాయి.

ఆ వ్యవహారం అలా కొనసాగుతుండగానే షాకింగ్ వంశీ తెదేపా-జనసేన బంధం గురించి సంచలన విషయాలు బయటపెట్టారు.ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులని గెలిపించడానికి జనసేన డమ్మీ క్యాండిడేట్లను పెట్టిందట. అంతేకాదు..  జనసేన అభ్యర్ధుల బి-ఫారాలు కూడా టీడీపీ ద్వారానే వెళ్లాయట. చంద్రబాబు ఆదేశాల మేరకే పవన్ గన్నవరంలో సీపీఐని పోటీకి పెట్టాడని వంశీ చెప్పినట్టు వైకాపా నేత విజయసాయి రెడ్డి ట్విట్ చేశారు. ఇప్పుడీ ట్విట్ వైరల్ అవుతోంది. నిజంగానే పవన్ కల్యాణ్ చంద్రబాబు చేతిలో కీలు బొమ్మా.. ? అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.