జీడిమెట్ల జీవికే లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి !

హైదారాబాద్ జీడిమెట్ల జీవీకే కెమికల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలడంతో అగ్నిప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పేలుడు ధాటికి షెడ్డు కూలిపోయింది. శిథిలాల్లో చిక్కుకుని అంబరీష్, అన్వర్ అనే కార్మికులు మరణించారు. మరో నలుగురికి తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 20 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. మృతులు బీహార్ కు చెందినవారిగా గుర్తించారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.