అన్ని అంశాలపైన చర్చకు సిద్ధం : ప్రధాని

మరికాసేపట్లో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సభ్యులు సహకరిస్తే అన్ని అంశాలపై కూలంకషంగా చర్చలు జరుపుకుందామన్నారు. చర్చల్లో వాదోపవాదాలు జరిగినా సానుకూలంగా పరిష్కరించుకుందామన్నారు. 

ఈసారి సమావేశాలకి గల ప్రత్యేకతని ప్రధాని వివరించారు.  2019లో ఇవి చివరి సమావేశాలు. ఈ సమావేశాలకు ప్రత్యేకత ఉంది.  రాజ్యసభకు ఇది 250వ సమావేశం. నవంబర్‌ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తాం. భారత రాజ్యాంగం 70 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుందని ప్రధాని మోదీ తెలిపారు.