మహేష్ సినిమా వీక్ అంటూ.. నెగటివ్ ప్రచారం ! 


అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున త్రివిక్రమ్-అల్లు అర్జున్ ల హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అల.. కంటే సరిలేరు ప్రమోషన్స్ లో వెనకబడి ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదే నిజమే అని గ్రహించిన సరిలేరు చిత్రబృందం త్వరలోనే టీజర్ ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. 

ఒక్క ప్రమోషన్స్ మేటర్ లోనే కాదు.. అసలు మహేష్ సినిమా వీక్ అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. మహేష్ సరిలేరు నీకెవ్వరు సేం అదే సినిమా కథ అంటూ ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ఇలా పనిగట్టుకొని మహేష్ సినిమాపై నెగటివ్ ప్రచారం చేస్తున్నది ఎవరు ? అన్నది మాత్రం అర్థకావడం లేదు. కచ్చితంగా మెగా ఫ్యాన్స్ అనుకోవడానికి వీల్లేదు. 

ఎందుకంటే ? ఇటీవల బ్యానర్లు కట్టి.. మరీ.. బన్నీపై నెగటివ్ ప్రచారం చేశారు. మొత్తానికి.. బన్నీ, మహేష్ రెండు సినిమాలు ఒకేసీజన్ లో ఒకేరోజు వస్తుండటంతో ఇటు మహేష్, అటు బన్నీ ఫ్యాన్స్ ని అనుమానించక తప్పడం లేదని అంటున్నారు. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ కి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ సుంకర్-దిల్ రాజు-మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.