మహేష్ ని డ్యామేజ్ చేసిన ఎన్టీఆర్ !


ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురంలో’ సినిమా డ్యామేజ్ చేస్తుందనే ప్రచారం ఉంది. ఈ రెండు సినిమాలు వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, సినిమా ప్రమోషన్స్ లో అల.. చాలా ముందుంది. పాటలతో హోరెత్తిస్తోంది. మరోవైపు సరిలేరు ప్రమోషన్స్ అంత ఎఫెక్టివ్ గా లేవు. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్ రిలీజ్ డేటుని ప్రకటించారు. ఈ నెల 22న టీజర్ ని వదలబోతున్నట్టు తెలిపారు.

ఐతే, సరిలేరు టీజర్ రిలీజ్ డేటు ప్రకటించడానికి ఒకట్రెండు నిమిషాల ముందు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రం నుంచి ఎన్ టీఆర్ లుక్ ని రేపు రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థ డివివి బ్యానర్ ట్విట్ చేసింది. దీంతో.. సోషల్ మీడియాలో ఫోకస్ అంతా ఆర్ ఆర్ ఆర్ పై పడింది. సరిలేరు టీజర్ రిలీజ్ డేటుపై కొంత ఫోకస్ తప్పింది. అందుకే మహేష్ ని తారక్ డ్యామేజ్ చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.