22న ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ 

‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ లాక్ తీశారు. ఈ నెల 22న టీజర్ ని విడుదల చేయబోతున్న ప్రకటించారు. నవంబర్ 22 సాయంత్రం 5:4గంటలకి టీజర్ ని వదలనున్నారు. ఈ మేరకు చిత్రబృందం టీజర్ అన్ లాక్ వీడియోని రిలీజ్ చేసింది. మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించే బిట్ సీన్స్ తో ఈ వీడియోని రూపొదించారు. నవంబర్ 23న దర్శకుడు అనిల్ రావిపూడి బర్త్ డే కానుకగా టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు.

మహర్షి తర్వాత సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న చిత్రమిది. ఇందులో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఆయనకి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తునారు. అనిల్ సుంకర్, దిల్ రాజు, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేరోజు అల్లు అర్జున్ అల.. వైకుంఠపురంలో కూడా విడుదల కానుంది.