జబర్థస్త్ మార్పు : అనసూయ స్థానంలో శ్రీముఖీ

జబర్థస్త్ షోలో భారీ మార్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ షో నుంచి మెగా బ్రదర్, నవ్వులు రాజు నాగబాబు తప్పుకొన్నారు. ఈ షో దర్శకులు కూడా మారారు. కీలక నటీనటులు మారారు. వీరందరు జీ టీవీలో ప్రారంభం కాబోతున్నకొత్త ప్రోగ్రామ్ కి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పుడు జబర్థస్త్ మార్పులో మరో ఆసక్తికర విషయం కూడా వెలుగులోకి వచ్చింది.

జబర్థస్త్ లో అనసూయ స్థానంలో యాంకర్ శ్రీముఖి రాబోతున్నట్టు సమాచారమ్. శ్రీముఖి కూడా యాంకరింగ్ చేయడంలో దిట్ట. అందులోను జబర్దస్త్ టీంతో శ్రీముఖికి మంచి పరిచయాలే ఉన్నాయి. ఆమెపై సటైర్స్ వేసినా.. పెద్దగా పట్టించుకోలేదు. షోని రక్తికట్టించడానికి అన్నీ రకాల సహకరిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 3 రన్నరప్ గా నిలిచిన శ్రీముఖి ఫ్యామిలీ ప్రేక్షకులకి మరింత దగ్గరైందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే జబర్థస్త్ కోసం శ్రీముఖీని తీసుకొన్నారని తెలుస్తోంది.

ఇక ఇన్నాళ్లు జబర్థస్త్ జడ్జీగా వ్యవహరించిన నాగబాబు స్థానంలోకి అలీని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అలీ కుదరకపోతే 30ఇయర్స్ పృధ్వీని తీసుకోవాలని చూస్తున్నారు. జబర్థస్త్ జడ్జీగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే రోజా వైసీపీ నాయకురాలు. పృధ్వీ కూడా వైసీపీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జబర్థస్త్ టీం అలీని తీసుకొచ్చేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.