తాను కోలుకున్నా : కృష్ణంరాజు

సీనియర్ రెబల్ స్టార్, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు. ఐతే, ఒకరోజులోనే ఆయన డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకొంటున్నారు. బుధవారం కృష్ణంరాజు-శ్యామలాదేవి దంపతుల పెళ్లిరోజు. ఈ సందర్భంగా బంజారాహిల్స్‌లోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో శత చండీ మహాయాగం నిర్వహించి, మహాలక్ష్మిదేవికి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా కృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు. “తనకు వైరల్ ఫీవర్ వచ్చింది. ఆ సమయంలొ కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు తాను కోలుకున్నానని తెలిపారు. తన అనారోగ్యం గురించి తెలుసుకున్న అభిమానులు కలత చెందారని, తానిప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని అన్నారు.