బాలాపూర్ ఏఎస్సై ఆత్మహత్యా యత్నం

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకొంది. బాలాపూర్ ఏఎస్సై నరసింహా ఆత్మహత్యా యత్నం చేశారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆత్మహత్యకు యత్నించారు. సమీపంలోని నీటి ట్యాంకు పైకి ఎక్కి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. 
తీవ్రంగా గాయపడిన ఏఎస్సైను సహచరులు అపోలో డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు. ఇటీవల బాలాపూర్ నుంచి మంచాల పీఎస్ కు నరసింహను బదిలీ చేశారు.

ఈ బదిలీపై నరసింహా తీవ్ర మనస్థాపం చెందినట్టు సమాచారమ్. ఈ బదిలి వెనక సీఐ సైదులే కారణమంటూ ఏఎస్సై నరసింహ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. కేవలం బదిలీ కారణంగానే నరసింహా ఆత్మయత్నకు యత్నించారా. ? దీని వెనక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ? అన్నది తెలియాల్సి ఉంది.