భూమా కుటుంబంలో గొడవలు.. కొత్త ట్విస్ట్ !

దివంగత నేత భూమా నాగిరెడ్డి కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. భూమా కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డి సొంత అక్కలపై ఎదురు తిరుగాడు. మాజీ మంత్రి భూమ అఖిల ప్రియ, ఆమె సోదరి పై విఖ్యాత్ రెడ్డి పోలీసులకి ఫిర్యాదు చేశాడు. గతంలో నాగిరెడ్డి అమ్మేసిన ఓ భూమికి సంబంధించి తనకి కూడా వాటా వస్తుందని వాధిస్తున్నాడనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రచారంపై విఖ్యాత్ రెడ్డి ఓ వీడియో ద్వారా స్పందించారు. 

“పొద్దున్నుంచి మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. నేనేదో కేసులు వేశానని చెబుతున్నారు. నేను దుబాయ్ లో ఉండటం వల్ల ఎవరికీ అందుబాటులోకి రాలేకపోతున్నా. మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మకండి. అవన్నీ అసత్యాలే. తామంతా కలిసే ఉన్నాం. భూమా కుటుంబాన్ని, భూమా కేడర్ ని ఎలా బలపరచాలా అనే మేమంతా ఆలోచిస్తాం. కానీ, మచ్చ వచ్చే పనులేవీ తాము చేయము. మీడియాలో వచ్చే వార్తలను దయచేసి నమ్మకండి” అంటూ కోరాడు. మరోవైపు, ఈ ప్రచారంపై అఖిలప్రియ స్పందించాల్సి ఉంది.