కోహ్లీ తొలి సెంచరీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో తొలి సెంచరీ చేశాడు. ఇప్పటికే టెస్టులో కోహ్లీ 26 సెంచరీలు బాదేశాడు. ఇప్పుడు తొలి సెంచరీ ఏంటని ఆశ్చర్యపోకండి. మేం చెబుతున్నది డే అండ్ టెస్టుల్లో. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్ లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. 159 బంతుల్లో 12 ఫోర్లతో 101 పరుగులు పూర్తి చేశాడు. 

కోహ్లీకిది టెస్ట్ సిరీస్ లో 27వ సెంచరీ. కానీ, డే/నైట్ టెస్టుల్లో ఇదే తొలి సెంచరీ. ఇక పింక్ టెస్టులో బంగ్లాని 106 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్ లో (347/9) డిక్లేర్ భారీ స్కోర్ చేసింది. దాంతో 241 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కొద్దిసేపటి క్రితమే రెండో ఇన్నింగ్స్ ప్రారభించిన బంగ్లా పరుగుల ఖాతా తెరవకుండా వికెట్ కోలోయింది.