అజిత్ పవార్’కు సీఎం కుర్చీ ఆఫర్ !

మహారాష్ట్ర రాజకీయాలు థ్రిల్లర్ సినిమాని మించిపోయాయ్. ట్విస్టుల మీద ట్విస్టులు వచ్చిపడుతున్నాయి. ఎన్సీపీ నేత, కొందిమంది ఎమ్మెల్యేల మద్దతుతో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఐతే, ఇప్పుడు ఆయనకి శివసేన ఏకంగా సీఎం పదవి ఆఫర్ చేసినట్టు సమాచారమ్.

వాస్తవానికి బీజేపీతో సీఎం కుర్చీని పంచుకోవాలని శివసేన ఆశపడింది. అందుకు బీజేపీ నో అనడంతో ఎన్సీపీ-కాంగ్రెస్ లతో కలిసి ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి రెడీ అయింది. ఐతే, ఆఖరి నిమిషంలో అజిత్ పవార్ వెన్నుపోటుతో కథ అడ్డం తిరిగింది. మరోసారి ఫడ్నవీస్ సీఎం అయ్యారు. ఐతే, ఇప్పుడు అజిత్ పవార్ కు శివసేన సీఎం కుర్చీ ఆఫర్ చేసింది. రెండున్నరేళ్లు సీఎం గా అవకాశం ఇస్తామని రాయభారం పంపింది. మరీ.. ఈ ఆఫర్ ని స్వీకరించి.. అజిత్ యూటర్న్ తీసుకొంటారా ? అన్నది చూడాలి.