ఆపరేషన్ కమల్’లో 4గురు ఎమ్మెల్యేలు మాత్రమే !

24గంటలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బలం నిరూపించుకోవాలని సుప్రీం ఆదేశించిన మహారాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్సీపీ నేత అజిత్ పవార్ వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంత మంది ? అనే చర్చ సాగుతోంది. ఐతే, భాజపా చేపట్టిన ఆపరేషన్ కమల్ లో ఉన్నది నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. 

సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, పోలీసులు ఆపరేషన్ కమల్ లో  భాగంగా ఉన్నారని సంజయ్ రౌత్ ఆరోపించారు. ఎంతమందిని రంగంలోకి దించినా ఫలితం ఉండదని.. నిజంగా మెజారిటీయే ఉంటే ఆపరేషన్ కమల్ చేపట్టాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనకు మెజార్టీ ఉందని సీఎం ఫడణవీస్ సమర్పించిన లేఖతో పాటు ఎన్సీపీ ఎమ్మెల్యేల సంతకాలతో శాసనసభాపక్ష నేత హోదాలో అజిత్ పవార్ సమర్పించిన లేఖ కూడా ఉందన్నారు.