ఆర్టీసీపై సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష.. ఏం తేల్చారంటే ?

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై మరోసారి సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్ లో మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మికుల అంశంతో పాటు ఇతర అంశాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి.. ఏం చేస్తే బాగుంటుందన్న విషయాలపై సీఎం అధికారులతో చర్చించారు.

సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు డిపోల వద్దకు వచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, ఆర్టీసీ అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో సీఎం చర్చించి దిశానిర్దేశం చేశారు. మరోవైపు ప్రైవేటు బస్సుల అంశంపై తదుపరి ప్రక్రియ చేపట్టాలని అధికారులను కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారమ్. గురువారం (నవంబర్ 28)న కేభినేట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరం ఆర్టీసీ భవితవ్యంపై ఓ క్లారిటీ రానుందని తాజా పరిస్థితులని బట్టీ అర్థమవుతోంది.