పీఎస్‌ఎల్వీ-సీ47 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

‘చంద్రయాన్ 2’ తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు రెడీ చేసిన మరో ప్రయోగం పీఎస్‌ఎల్వీ-సీ47. ఈ ఉదయం  7.28 గంటలకు శ్రీహరికోటలో పీఎస్‌ఎల్వీ-సీ47 కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. కౌంట్‌డౌన్‌ ప్రక్రియ 26 గంటల పాటు కొనసాగనుంది. రేపు ఉదయం 9.28 గంటలకు పీఎస్‌ఎల్వీ-సీ47 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. మొత్తం 14 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ-సీ47 వాహకనౌక మోసుకెళ్లనుంది.

కార్టొశాట్‌-3తో పాటు అమెరికాకు చెందిన మరో 13 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ-సీ47 వాహకనౌక నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. కార్టొశాట్‌3 ఉపగ్రహం భూవాతావరణం, విపత్తులను హెచ్చరించనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో కార్టొశాట్‌-3ని రూపొందించింది. 1,625 కిలో బరువున్న కార్టొశాట్‌-3 జీవితకాలం ఐదేళ్లపాటు సేవలందించనుంది.