శ్రీకాళహస్తిలో క్షుద్రపూజలపై ప్రభుత్వం సీరియస్

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని వేడాంలో ఉన్న కాలభైరవ ఆలయంలో అమావాస్య రోజు అర్ధరాత్రి తమిళనాడుకు చెందిన ఐదుగురు క్షుద్రపూజలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. క్షుద్రపూజల సంగతి తెలుసుకున్న పోలీసులు ఐదుగురు తమిళనాడు వాసులను ఆరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో శ్రీకాళహస్తి ఏఈవో ధనపాల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దీనిపై శాఖపరమైన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై ప్రాథమిక స్థాయిలో వివరాలు అడిగితెలుసుకున్న మంత్రి … 24 గంటల్లోగా దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని దేవాదాయశాఖ కార్యదర్శిని ఆదేశించారు.