ఏపీ కేబినేట్ తీసుకున్న కీలక నిర్ణయాలివే.. !

అమరావతిలో సీఎం జగన్ అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగిన కేభినేట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.

* జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు కేబినెట్‌ ఆమోదం

* నవశకం సర్వే ద్వారా వివిధ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయం

* సంక్షేమ పథకాలకు వేర్వేరు కార్డుల జారీకి కేబినెట్‌ ఆమోదం 

*  రేషన్ కార్డుకు అర్హతలు మార్పు. 2,50,000 వార్షిక ఆదాయం, 10 ఎకరాలలోపు మాగాణి, 25 ఎకరాలలోపు మెట్ట ఉన్నవారు అర్హులు.

* జగనన్న వసతి దీవెన కింద రూ.2300కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద రూ.3400కోట్లు కేటాయింపు

* కడప ఉక్కు పరిశ్రమకు ముడిసరుకు కోసం ఎన్‌ఎండీసీతో ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం. జమ్మలమడుగు మండలం పెదదండ్లూరు వద్ద 3,200 ఎకరాల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు

* వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం పథకానికి రూ.1101కోట్లు కేటాయింపు. ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఏడాదికి రూ.15వేల ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయం. 45 ఏళ్లు నిండిన ప్రతి కాపు మహిళకు ఐదేళ్లలో రూ.75వేలు అందజేతకు కేబినెట్‌ ఆమోదం 

* ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం

* ఏపీఎస్‌పీడీసీఎల్‌ను విభజించి సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు నిర్ణయం.

* తితిదే పాలకమండలి సభ్యుల సంఖ్య 19 నుంచి 29కి పెంపు

* ఒప్పంద ఉద్యోగుల అంశంపై కమిటీ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం