‘దర్బార్‌’ సాంగ్ వచ్చేసింది !

మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్  కథానాయకుడిగా నటించిన చిత్రం ‘దర్బార్‌’. నయనతార కథానాయిక. నివేదా థామస్‌, ప్రకాశ్‌రాజ్‌, యోగిబాబు, మనోబాలా, సుమన్‌, హరీష్‌ ఉత్తమన్‌, ఆనంద్‌రాజ్‌, శ్రీమన్‌లు కీలకపాత్రలు పోషించారు. ఇందులో ఆదిత్య అరుణాచలం అనే పోలీస్‌ అధికారి పాత్రలో నటించారు.

తాజాగా ఈ సినిమా నుంచి సినిమా ఫస్ట్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ‘దుమ్మూ దూళి’ అంటూ సాగే ఈ పాటను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు పాడారు. అనిరుధ్‌ అందించిన సంగీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న దర్భార్ ప్రేక్షకుల ముందుకు రానుంది.