మహా సీఎం ప్రమాణ స్వీకారం.. స్పెషల్ గెస్టులు వీరే !

మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టులు ముగిశాయ్. మహా సీఎంగా శివసేనాని ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలింది. గురువారం సాయంత్రం 6 గంటలకు దాదర్‌లోని శివాజీ పార్క్‌లో ఉద్దవ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా పలువురు ప్రముఖులను ఆహ్వానించారు.

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్‌, ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హాజరుకానున్నారు. వీరితో పాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అంతేకాదు రైతులని ప్రత్యేకంగా ఆహ్వానించారు. మహారాష్ట్ర నలుమూలల నుంచి 400 మంది రైతులతో పాటు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబసభ్యులకు ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. ఉద్దవ్ ప్రమాణ స్వీకారానికి వారే స్పెషల్ గెస్టులని శివసేన వర్గాలు చెబుతున్నాయి.