ప్రియాంక హత్య కేసు.. కేటీఆర్ సీరియస్ !

హైదరాబాద్ నగర పరిధిలోని షాద్ నగర్ లో ప్రియాంకరెడ్డి (22) అనే వెటర్నరి దారుణ హత్యకి గురైన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రియాంక స్కూటీని పంచర్ చేయిస్తామని తీసుకెళ్లిన ఇద్దరు లారీ డ్రైవర్లే ఆమెని హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఇద్దరు వ్యక్తులు ప్రియాంకని బలవంతంగా బిడ్జి క్రిందకి తీసుకెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. వారిద్దరు లారీ డ్రైవర్స్ నేనా ? అనే విషయాన్ని కనుగొనే పనిలో పోలీసులు ఉన్నారు.

ఇక ఈ కేసుని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రియాంక హత్య కేసుపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘దారుణానికి ఒడిగట్టిన మృగాళ్లను పోలీసులు పట్టుకుంటారని నమ్మకం ఉంది. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందేలా చేస్తాం. కేసును నేనే పర్సనల్‌గా మానిటరింగ్‌ చేస్తున్నా . ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే డయల్‌ 100కి ఫోన్‌ చేయాలని’ కేటీఆర్‌ సూచించారు.