ప్రియాంకరెడ్డి హత్య కేసు : నిందితులు అరెస్ట్

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసుని పోలీసులు జెడ్ స్పీడుతో చేధించారు. తాజాగా నిందితులని అదుపులోనికి తీసుకొన్నారు. నలుగురు నిందితులను అదుపులోకి అరెస్ట్ చేశారు. సీసీటీవీ పుటేజ్‌ ఆధారంగా లారీ డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. వీరే స్కూటీని పంక్చర్‌ చేసి డ్రామాలు ఆడారని పోలీసులు గుర్తించారు. 

ప్రియాంకపై నిందితులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెని దుప్పట్లో కప్పి.. పెట్రోల్ పోసి తగలబెట్టారని పోలీసుల విచారణలో తేలినట్టు తెలుస్తోంది. ప్రియాంక మృతదేహాం 70 శాతం కాలిపోయింది. లారీ డ్రైవర్లు హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. ప్రియాంక హత్య కేసు యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. ఈ కేసుని పర్సనల్ గా తీసుకొన్నట్టు మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు. 24గంటల్లో కేసుని చేధించిన పోలీసులు.. ఈ సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు తెలపనున్నారు.