శభాష్ లాయర్లు

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణ హత్య అందరినీ కలచివేస్తోంది. నలుగురు కిరాతకులు ప్రియాంకరెడ్డిని దారుణంగా అత్యాచారం చేసి.. హత్య చేశారు. నిందితులని శుక్రవారం మీడియా ముందు హాజరుపరిచిన పోలీసులు.. మరికొద్దిసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. నిందితుల తరపున న్యాయవాదులెవరూ కోర్టులో వాదించకూడదని తీర్మానం చేసింది. నిందితులకు మరణశిక్ష పడేవరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా లాయర్లు తెలిపారు.

మరోవైపు, షాద్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ వద్ద  తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు దూసుకెళ్లారు పోలీస్ స్టేషన్ లోనికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. నిందితులను తమకు అప్పగించాలంటూ వారు నినాదాలు చేస్తున్నారు. ఇటువంటి మృగాళ్లకు జీవించే హక్కు లేదంటూ వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద భారీ భద్రతని ఏర్పాటు చేశారు.