జియో కస్టమర్లకి షాక్

‘సొచ్చేదాక సోమలింగం సొచ్చినంక రామలింగం’ అన్నట్టుగా ఉంది టెలికాం సంచలనం జియో తీరు. ముందు మురిపించింది.. ఇప్పుడు ఏడిపిస్తోంది. అతి తక్కువ ధరలకే అన్ లిమిటెడ్ ఫోన్ కాల్స్, డేటాని అందించి టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించింది. జియో దెబ్బకు ఇతర నెట్ వర్క్స్ కుదేలయ్యాయి. కంపెనీలే మూసేసుకోవాల్సి వచ్చింది. 

అలాంటి జియో ఇప్పుడు మిగితా నెట్ వర్క్స్ మాదిరిగానే రేట్స్ పెంచుతూ షాక్ ఇస్తుంది. వాయిస్‌, డేటా ఛార్జీలను 40 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. డిసెంబర్‌ 6 నుంచి కొత్త అన్‌లిమిటెడ్‌ ప్లాన్లు తీసుకొస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో నూతన ప్లాన్ల కింద 300 శాతం అదనపు ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. అన్‌లిమిటెడ్‌ వాయిస్‌, డేటాతో కొత్త ఆల్‌ఇన్‌ వన్‌ ప్లాన్లను జియో ప్రవేశపెట్టబోతోంది. అంతేకాదు.. మునుపటి జియో సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండటం లేదు.